తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పునఃప్రారంభమైంది. పాశర్లపూడి గ్రామంలో వైయస్ జగన్కు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు వైయస్ జగన్ను కలిసి అర్జీలు అందజేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.