కొత్తపెంట నుంచి 253వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

విశాఖ‌ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం జననేత మడుగుల నియోజకవర్గంలోని కొత్త‌పెంట శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి  ఎ. భీమవరం, పడుగు పాలెం మీదుగా ఎ. కోడూరు వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది.  భోజన విరామం అనంత‌రం తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాదయాత్ర కె.కోటపాడు మండలంలోని కె. కోటపాడు మీదుగా జోగన్న పాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. 
Back to Top