ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడ చేపట్టలేదు

శ్రీకాకుళం( టెక్కలి)) టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లున్నా దాటినా గ్రామంలో ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని వజ్జీలపేట గ్రామస్తులు అన్నారు. నందిగాం మండలం వజ్జీలపేట గ్రామంలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను పలువురు తిలక్ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటి లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.


Back to Top