ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి

న్యూఢిల్లీ: రాజ్యసభలో జేడీయూ ఎంపీలపై అనర్హత వేటు వేసినట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎంపీలు ఎస్పీవైరెడ్డి, కొత్తపల్లి గీత,  బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. బుధవారం లోక్‌సభ స్పీకర్‌ను వైవీ సుబ్బారెడ్డి కలిసి ఫిరాయింపు ఎంపీలపై ఫిర్యాదు చేశారు.  సెక్రటరీ జనరల్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ హామీ ఇచ్చారు. 
 
Back to Top