న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరం, దుగ్గరాజపట్నం, కడప స్టీల్ ప్లాంట్ వంటి హామీలను అమలు చేయాలని వారు నినదించారు. నాలుగేళ్ల పాలనలో టీడీపీ విభజన చట్టంలోని హామీలను సాధించడంలో విఫలమైందని మండిపడ్డారు. కేంద్రం స్పందించి ఏపీకి న్యాయం చేయాలని ఎంపీలు కోరారు