అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
చింతమనేని దాదాగిరి.. వైయస్సార్సీపీ నేతల ఆగ్రహం
31 Oct 2017 4:00 PM
ఏలూరుః దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను ఆయన అనుచరులు నోటికొచ్చినట్టు దూషించారు. ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలోని మల్కాపురంలో తన అనుచరులతో తిరుగుతూ... వైయస్సార్సీపీ నేత తూతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. నిరంజన్ ఇంటి వెనుక భాగంలో ప్రహరీగోడకు పశువులను కట్టేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప కొంకాలను పీకించారు. ప్రభాకర్ వెనక భాగం నుంచి ఇంట్లోకి ప్రవేశించి మహిళలను తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు.
కుళాయికి ఏర్పాటు చేసిన మోటార్ విద్యుత్ వైర్లను కట్ చేయించారు. అధికార బలంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గం కన్వీనర్ కొఠారు రామచంద్రరావు చింతమనేని ప్రభాకర్ను హెచ్చరించారు. సోమవారం మల్కాపురంలో నిరంజన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.