వైయస్ఆర్ జిల్లా: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్కు వైయస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని సూచించారు.