హైదరాబాద్ః ఏపీకి ప్రత్యేకహోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆగష్టు 2న వైయస్సార్సీపీ తలపెట్టనున్న రాష్ట్ర బంద్ లో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపునిచ్చారు. తనతో కలిసి వచ్చి బంద్ ను విజయవంతం చేయాలని ట్విట్టర్ ద్వారా వైయస్ జగన్ రాష్ట్ర ప్రజానీకానికి సందేశాన్ని పంపారు. <br/>