చంద్రబాబు దిగజారుడు రాజకీయాలుఎమ్మెల్యేలు, ఎంపీలపై తప్పుడు కేసులుఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా ఉండదుప్రజలు బాబుకు తగిన బుద్ధి చెబుతారుటీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన వైఎస్ జగన్<br/>నెల్లూరుః వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ చంద్రబాబు రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలన్న కుట్ర పన్నుతున్నారంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబే దగ్గరుండి మరీ మిథున్ పై తప్పుడు కేసు పెట్టించారని వైఎస్ జగన్ మండిపడ్డారు. <br/><strong>అవినీతిని అడ్డుకున్నాడనే..</strong>నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు ఎమర్జెన్సీ పాలనపై నిప్పులు చెరిగారు. కుప్పంలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ ప్రాజెక్ట్ టెండర్లలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. బాబు అవినీతిని అడ్డుకుంటున్నాడనే మిథున్ పై తప్పుడు కేసులు బనాయించారన్నారు. కమిషన్ ల కోసం చంద్రబాబు, ఆయన కొడుకు.. చివరకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై దొంగకేసులు పెట్టే స్థాయికి దిగజారడం సిగ్గుచేటని ఫైరయ్యారు. <br/><strong>దమ్ముంటే పుటేజ్ బయటపెట్టాలి..</strong>2 గంటలప్పుడు తనను సాగనంపడానికి మిథున్ తిరుపతి ఎయిర్ పోర్ట్ కు వచ్చాడని వైఎస్ జగన్ తెలిపారు. ఎయిర్ పోర్ట్ మేనేజర్ బోర్డింగ్ పాస్ లు ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని 19 మంది ప్రయాణికులు అతని మీద ఫిర్యాదు చేస్తూ..మిథున్ ను కలిశారని చెప్పారు. వారికి జరిగిన అన్యాయంపై మిథున్ మేనేజర్ ను నిలదీయడమే తప్పా అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రయాణికులు రాతపూర్వకంగా మేనేజర్ మీద కంప్లైంట్ చేస్తే ఆలెటర్ బయటకు ఎందుకు రానీయడం లేదని బాబును గట్టిగా నిలదీశారు. మిథున్ ఎయిర్ పోర్ట్ మేనేజర్ ను కొట్టి ఉంటే.. సీసీ పుటేజ్ ఎందుకు చూపించడం లేదని వైఎస్ జగన్ ఛాలెంజ్ చేసి అడిగారు. <br/><strong>చంద్రబాబు స్కెచ్ ప్రకారం..</strong>చంద్రబాబును ఒక్కటే డిమాండ్ చేస్తున్నా...మిథున్ చేయి చేసుకొని ఉంటే సీఐఎస్ ఎఫ్ పోలీసులు లేరా..మిథున్ కొట్టి ఉంటే కేసు పెట్టేవారే కదా. కావాలనే చంద్రబాబు ఇదంతా చేశారు. అదే ఎయిర్ పోర్ట్ కు చంద్రబాబు సాయంత్రం ఫ్లైట్ లో వచ్చారు. అప్పుడే దీనిపై స్కెచ్ వేశారు. బలవంతంగా మేనేజర్, పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మేనేజర్ ఇంటికి వెళ్లాక అతనిని పట్టుకొచ్చి మరీ కేసు పెట్టించారు. రాత్రికి రాత్రి మేనేజర్ ను రుయో ఆస్పత్పికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ రిపోర్ట్ చేస్తే బాగా ఉన్నాడు ఏదెబ్బలు లేవని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు. మరుసటి రోజు మేనేజర్ డ్యూటీకి అటెన్డ్ అయ్యాడు. కేసు నీరుగారిపోతుందని చంద్రబాబు, ఆయన దూతలు వచ్చి ... ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మేనేజర్ ను యశోద హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు రిపోర్ట్ చూపించారు. <br/><strong>చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి..</strong>సమైకాంధ్ర ఉద్యమం కేసు అని చెప్పి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తే సన్మానించాల్సిందిపోయి...అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దుర్మార్గం. జైల్లో చెవిరెడ్డిపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని మిథున్ చెప్పారు. గోడల మీద రాతలు రాశాడని చెప్పి అతనిపై మరో అక్రమ కేసు పెట్టి పీలేరుకు తరలించే కుట్ర చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న వారిని కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలను సైతం లెక్కచేయకుండా వారిని కట్టడి చేయడంపై వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. దగ్గరుండి ఇంత అన్యాయమైన పాలన సాగిస్తున్న చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని జననేత ఫైరయ్యారు. <br/><strong>బంగాళాఖాతమే...</strong>మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, రోజా, భూమా నాగిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని ఇలా అందరిపై తప్పుడు కేసులు బనాయిస్తూ చంద్రబాబు అరాచక పాలన సాగిస్తున్నాడన్నారు. ప్రజలు, పైనుంచి దేవుడు అంతా గమనిస్తున్నారని...చంద్రబాబుకు త్వరలోనే బుద్ధి చెబుతారని వైఎస్ జగన్ స్పష్టీకరించారు. ఖచ్చితంగా చంద్రబాబుకు అందరి ఉసురు తగులుతుందని...రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో పడిపోతాడన్నారు. ఎల్లకాలం ఇలాగే ఉండదని, ఏదైతే విత్తుతామో అదే పండుతుందని వైఎస్ జగన్ అన్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకు ఇదే పరిస్థితి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.