హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత చేపట్టనున్న పాదయాత్రకు "ప్రజాసంకల్పం"యాత్రగా నామకరణం చేశారు. హైదరాబాద్లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన పార్టీ విసృత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 6వ తేదీ నుంచి 6 నెలల పాటు వైయస్ జగన్ పాదయాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, వాటిని పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. <br/>వైయస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇతర జిల్లాల్లో పార్టీ శ్రేణులు చేయాల్సిన కార్యక్రమాలపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించారు. వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు తదితర నాయకులు హాజరయ్యారు. <br/>ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ....మొత్తం 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3 వేల కి.మీ. కు పైగా వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో పదివేలకు పైగా గ్రామాల్లో వైయస్ జగన్ ప్రజలతో మమేకమవుతారు. పాదయాత్రలో వివిధ ప్రజాసంఘాలతో వైయస్ జగన్ 182 సమావేశాలు నిర్వహించనున్నారు. 125 భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. <br/><img src="/filemanager/php/../files/untitled%20folder/untitled%20folder/YSRCP%20Praja%20Sankalpam%20and%20plan%20of%20action%20for%20next%20six%20months-page-002.jpg" style="width:780px;height:1012px"/><img src="/filemanager/php/../files/untitled%20folder/untitled%20folder/YSRCP%20Praja%20Sankalpam%20and%20plan%20of%20action%20for%20next%20six%20months-page-004.jpg" style="width:780px;height:1012px"/><br/>