పంచె క‌ట్టి, కండువా ధరించి..

 
 చిత్తూరు : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా  పంచె క‌ట్టి, కండువా ధరించారు.  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పారకాల్వ క్రాస్‌ వద్ద ఆయన సోమవారం ఉదయం పండుగ వేడుకల్లో ఉత్సాహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించారు.  వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, సునీల్‌ కుమార్‌ రెడ్డి, నారాయణస్వామితో పాటు పార్టీ నేతలు భూమన కరుణాకర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డితో పాటు స్థానిక నాయకులు, పాదయాత్ర బృందం కూడా పాలుపంచుకున్నారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు వైయ‌స్‌ జగన్‌ ఇవాళ  విరామం ఇచ్చారు. పారకాల్వ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాదయాత్ర శిబిరంలోనే ఉన్నారు. జ‌న‌నేత‌కు ప‌లువురు నేత‌లు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Back to Top