<br/>తూర్పు గోదావరి: చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని స్థానికులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ పాదయాత్ర కొద్ది సేపటి క్రితం కాకినాడ నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైయస్ జగన్ మాస్క్లు ధరించి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మహిళలు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రాజన్న రాజ్యంతోనే తమకు మేలు అని మహిళలు అభిప్రాయపడ్డారు. జాబు వస్తే జాబు వస్తుందని ఆ రోజు ఓట్లు వేయించుకొని మోసం చేశారని మండిపడ్డారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు భద్రత, రక్షణ దొరుకుతుందని పేర్కొన్నారు. నవరత్నాలతో మా అందరికి మంచి జరుగుతుందన్నారు. వైయస్ జగన్ తమ కోసం పోరాడే శక్తి అని మహిళలు పేర్కొన్నారు.