<strong>హైదరాబాద్, 24 ఏప్రిల్ 2013:</strong> వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ నెల 27 నుంచి రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. చేవెళ్ల నుంచి రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆమె పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీమతి విజయమ్మ రచ్చబండ పోస్టర్ను రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులు బుధవారంనాడు హైదరాబద్లో విడుదల చేశారు.