వైయస్ఆర్ సీపీ అధికారంలోకి రావడం ఖాయం


పులివెందుల (వైయస్ఆర్ కడప జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జిల్లా ఎన్నికల పరిశీలకుడు, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో ప్రాంతాలకతీతంగా జనం పాల్గొంటున్నారన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు ఎదురొచ్చి తమ కష్టాలు చెప్పుకుంటున్నారన్నారు.

     తెలంగాణలోనూ శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోందని పులివెందులలోని వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి విలేకరులతో సమావేశంలో తెలిపారు. 2014లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.

     దేవుడి దయవల్ల వైఎస్ జగన్ త్వరలోనే బెయిల్‌పై బయటకు వస్తారన్నారు.  జగన్ రాకకోసం జనమంతా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  రానున్న కాలంలో ఎలాంటి ఎన్నికలనైనా ఎదుర్కోవడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని శివశంకర్‌రెడ్డి చెప్పారు.

Back to Top