వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన నేతలు

కొత్తగూడెం అర్బన్, 06 మే 2013:

ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గ సీపీఐ, టీడీపీలకు చెందిన పలువురు  నేతలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ పినపాక నియోజకవర్గ సమన్వయకర్త పాయం వెంకటేశ్వర్లు, సీజీసీ సభ్యులు చందా లింగయ్య ఆధ్వర్యంలో శ్రీమతి షర్మిల వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పినపాక మండల టీడీపీ అధ్యక్షులు రావుల సోమయ్య, తెలుగు యువత మండల ప్రచార కార్యదర్శి రావుల రవితో పాటు పినపాక మండలంలోని కరకగూడెం, భట్టుపల్లి, సమత్‌భట్టుపల్లి గ్రామాలకు చెందిన మరో 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. టీడీపీ మండల నాయకులు ఉప్పర్ల రామారావు, బర్ల వెంకన్న, పోతిబోయిన సారయ్య, పూనెం శంకరయ్య, కొమరం లాలయ్య, తొలెం ఎర్రయ్య, దయ్యాల మల్లయ్య, డేగాల విజయ్, వీరగాని సమ్మయ్య, గొగ్గల రవి, జి. స్వామి, కొమరం స్వామి, గొగ్గలి నరేందర్, వుప్పలి నాగేష్, మిట్టపల్లి చందు, తొలెం రాంబాబు, గొసంగి శంకర్, మోడెపు సాంబయ్య, జలగం ఐలయ్య, తదిదరులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శ్రీ జగన్మోహన్ రె్డితోనే సాధ్యమన్న విశ్వాసంతో తాము పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, అహ్మద్‌హుస్సేన్, పి. తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు సీపీఐ జిల్లా నాయకులు శ్రీమతి షర్మిల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ పినపాక నియోజకవర్గ ఇన్‌చార్జి పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీపీఐ జిల్లా నాయకులు కైపు సుబ్బిరామిరెడ్డి, పసుపులేటి విజయలక్ష్మి, తదితరులు పార్టీలో చేరారు. కండువాలు కప్పి షర్మిల వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖర్, జిల్లా నాయకురాలు పాయం ప్రమీల పాల్గొన్నారు.

Back to Top