పశ్చిమ గోదావరి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడంలో చంద్రబాబు ఆరితేరారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని చింతలపూడిలో వైఎస్సార్సీపీ కార్యలయం ప్రారంభోత్సవం జరిగింది. <br/>ఈ కార్యక్రమానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు సహా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.<br/>ఈసందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...పుష్కరాల్లో 30 మంది చనిపోయిన ఘటనపై విచారణ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల పేరుతో 1800 కోట్ల రూపాయలను బూడిదలో పోశారని టీడీపీ సర్కార్ పై ఫైరయ్యారు.