మోసం చేయడం బాబు నైజం

పశ్చిమ గోదావరి:
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రబాబు పాలనపై
నిప్పులు చెరిగారు.  రాష్ట్ర  ప్రజానీకాన్ని మోసం చేయడంలో చంద్రబాబు
ఆరితేరారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు
నియోజకవర్గంలోని చింతలపూడిలో  వైఎస్సార్సీపీ కార్యలయం ప్రారంభోత్సవం
జరిగింది.  

ఈ కార్యక్రమానికి ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే
ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్,
జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు సహా స్థానిక నాయకులు,
కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.

ఈసందర్భంగా
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...పుష్కరాల్లో 30 మంది చనిపోయిన
ఘటనపై విచారణ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల పేరుతో
1800 కోట్ల రూపాయలను బూడిదలో పోశారని టీడీపీ సర్కార్ పై ఫైరయ్యారు. 
Back to Top