ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

చిత్తూరు: మండల సర్వసభ్య సమావేశంలోకి అనర్హులకు ప్రవేశం కల్పించి కాలాన్ని వృథా చేస్తున్నారంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ నిరసన తెలిపారు.  ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.00 గంటలైనా ఎందుకు ప్రారంభించలేదని ఎంపీడీవో పార్వతమ్మపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సింగిల్ విండో చైర్మన్లు తదితరులను సమావేశానికి ఎలా రానిస్తారని ఎంపీడీవోను ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు సమావేశం జరుపుతామని ఎంపీడీవో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా అక్కడే బైఠాయించారు. 

తాజా వీడియోలు

Back to Top