వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తుపాను బాధితులను ఆదుకోండి
20 Oct 2013 12:38 PM
హైదరాబాద్, 20 అక్టోబర్ 2013:
పై లీన్ తుపాను ధాటికి భారీగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా రైతులు, మత్స్యకారులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె శనివారంనాడు ఒక లేఖ రాశారు. ‘శ్రీకాకుళం జిల్లాలో పై లీన్ తుపాను ఉత్పాతాన్ని మిగిల్చి వెళ్లిందని, ఆ జిల్లా ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేయడంతో పాటు వారికి జీవనాధారం కూడా లేకుండా చేసింద’ని శ్రీమతి విజయమ్మ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతగా నష్టం జరిగిన ప్రాంతంలో పాలకులు ఏరియల్ సర్వే కూడా ఇంతవరకూ చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అదే విధంగా సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ప్రజలను దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేశారన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లో తాను విస్తృతంగా పర్యటించి ఆ ప్రాంత ప్రజల దుర్భర పరిస్థితిని కళ్లారా చూశానని శ్రీమతి విజయమ్మ ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ‘రైతులు పంటలు నష్టపోయారు, మత్స్యకారులు పడవలు, వలలు కోల్పోయి జీవనోపాధిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని స్థానికులు చెప్పారు’ అని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వం ఘోర వైఫల్యం ఇది:
పై లీన్ తుపాను కారణంగా పంటలు, జీడిపప్పు, కొబ్బరి తోటలు కోల్పోయిన రైతులను, వలలు, పడవలు పోగొట్టుకున్న మత్స్యకారులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. వారిని తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని ఆమె తన లేఖలో ప్రధానిని కోరారు. తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం పరిశీలక బృందాలను రాష్ట్రానికి పంపాలని, నిధులు విడుదల చేసి సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ప్రధానికి రాసిన లేఖలో పదకొండు డిమాండ్లను పొందుపరిచారు.
శ్రీమతి విజయమ్మ లేఖలో డిమాండ్లు ఇవే..:
- తుపాను వల్ల నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఇంకా ఆలస్యం చేయకుండా తక్షణ సాయం అందించాలి.
- హుడా కమిటీ సిఫార్సుల ప్రకారం.. చేతికి వచ్చిన పంట నష్టపోయిన వారికి ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలి.
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలి.
- కొబ్బరి తోటలకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఒక చెట్టును యూనిట్గా కాకుండా ఎకరాను ఒక యూనిట్గా తీసుకోలి.
- జీడిపప్పు తోటలతో పాటు ఇతర ఉద్యాన పంటలకు కూడా పరిహారం చెల్లించాలి.
- పంట నష్టపరిహారాన్ని అన్ని రకాల పంట పొలాలకు వర్తింపజేస్తూ, అవి ఏ దశలో ఉన్నా పరిగణనలోకి తీసుకోవాలి.
- మత్స్యకారులకు ఈ రోజు వరకూ ఎలాంటి సాయం అందలేదు. బియ్యం, ఇతర సామగ్రి కొనుగోలు చేయడానికి తగినంత సాయం అందజేయాలి.
- తుపానులో పడవలు పోగొట్టుకున్న మత్స్యకారులందరికీ పరిహారం ఇచ్చి తీరాలి.
- జీవనోపాధి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాలి.
- తుపాను బీభత్సం వల్ల ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి, వాటన్నింటికీ వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి.
- తుపాను పీడిత ప్రాంతాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. అక్కడ తక్షణం మంచినీరు అందేలా చూడాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.