ఉప్పాడ సెంటర్‌లో నేడు షర్మిల బహిరంగసభ

కాకినాడ, 15 జూన్‌ 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం 180వ రోజు వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు. తిమ్మాపురం నుంచి శనివారం ఉదయం‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పండూరు, పి.వెంకటాపురం క్రాస్‌రోడ్‌, పవర క్రాస్‌రోడ్‌ మీదుగా 4.6 కిలోమీటర్ల నడిచిన అనంతరం చిత్రాడకు ముందు మధ్యాహ్న భోజనానికి ఆగుతారు.

భోజన విరామం అనంతరం చిత్రాడ, పిఠాపురం బ్రిడ్జి, ఉప్పాడ సెంటర్‌ వరకూ నడుస్తారు. ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించే బహిరంగసభలో ఆమె వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి కోటగుమ్మం జంక్షన్‌, పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌ వరకూ మరో 7.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. పిఠాపురంలో శనివారం రాత్రికి శ్రీమతి షర్మిల బస చేస్తారని రఘురాం, చిట్టబ్బాయి చెప్పారు. శనివారం మొత్తం 12 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.

Back to Top