వైయస్ఆర్ జిల్లా: డిమాండ్ల సాధన కోసం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట చేనేతలు చేపట్టిన నిరాహార దీక్షకు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన చేనేతలకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి చేసి అడ్డుకుంటున్నారన్నారు. అర్హులందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండు చేశారు.