19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
అమ్మ హస్తం.. ఇదీ బండారం
26 Jun 2013 5:20 PM
నర్సీపట్నం 26 జూన్ 2013:
అమ్మ హస్తం పథకంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సరకుల బండారాన్ని కృష్ణాపురం గ్రామస్థులు బయటపెట్టారు. బుధవారంనాడు ఉదయం శ్రీమతి వైయస్ షర్మిల తన 192వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇక్కడినుంచే ప్రారంభించారు. రాత్రి బస నుంచి బయటకు వచ్చిన ఆమెకు గ్రామస్థులు అమ్మ హస్తం సంచితో ఎదురేగారు. ఆ సంచితో ఇస్తున్న సరకుల నాణ్యత అస్సలు బాగోలేదనే విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చారు. కారంలో కల్తీ ఉన్న విషయాన్ని వారు దానిని నీళ్ళలో వేసి చూపించారు. అలాగే ఉప్పు, పసుపు నాసిరకంగా ఉన్న విషయాన్ని కూడా తెలిపారు. శ్రీమతి షర్మిల ఆయా సరకులను చేతితో ముట్టుకుని పరిశీలించారు. ప్రభుత్వం తీరును ఆమె విమర్శించారు. రాయితీ ఇస్తున్నామని చెప్పగానే సరికాదనీ, సరకులను నాణ్యంగా ఇవ్వలేకపోతే అది ఇచ్చీ ఉపయోగం ఉండదనీ ఆమె మండిపడ్డారు. ఎదురైన వారందరినీ ఆత్మీయంగా పలుకరిస్తూ కష్టాలు తెలుసుకుంటూ శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగించారు.