కృష్ణా: అధికారుల తీరుకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూజీవీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జన్మభూమిలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో సభను నిర్వహించడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.