జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన విజయమ్మ
24 Dec 2012 7:39 PM
హైదరాబాద్:
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాష్ట్రంలోని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం, శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని ఆమె పేర్కొన్నారు. సర్వత్రా అశాంతి నిండిన ప్రస్తుత పరిస్థితులలో క్రీస్తు ప్రవచనాలు మనకు దారి చూపుతాయనీ, శాంతియుత సహజీవనమే క్రిస్మస్ మనకిచ్చే దివ్య సందేశమనీ శ్రీమతి విజయమ్మ తెలిపారు. ప్రజలంతా సంయమనంతో కలిసిమెలిసి ఉండాలన్న క్రీస్తు బోధనలు ఆచరణలోకి వచ్చినప్పుడు సామాజిక సంక్షోభాలు సమసిపోతాయని ఆమె ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు.