<br/>కర్నూలు: వైయస్ఆర్ కాంగెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్రెడ్డిని దొర్నిపాడు మండలంలోకి కేసీ కెనాల్ రైతులు గురువారం కలిశారు. పంటలు పూర్తి అయ్యే వరకు కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయించాలని ప్రతిపక్ష నేతను కోరారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై పోరాటం చేయాలని కోరారు.