విజయనగరం: చెల్లెంపేట గ్రామంలోని 50 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. గ్రామానికి చెందిన కె. కమలమ్మ, పైడమ్మ, వెంకటినాయకుడు, త్రినాథ, సీతంనాయుడు, సత్యనారాయణ సహా పలువురు వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త జె. ప్రసన్నకుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ఉదయబానులు వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.