మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
'బిజెపితో దోస్తీకి చంద్రబాబు కసరత్తు'
24 Jun 2013 3:52 PM
ఒంగోలు, 24 జూన్ 2013:
తొమ్మిదేళ్ళుగా అధికార పీఠానికి దూరమై అల్లాడిపోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలాగైనా దాన్ని సాధించాలని ఎత్తులు, పైయెత్తులు వేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తాజాగా ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం కసరత్తు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి అన్నారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారని ఆయన సోమవారంనాడు హైదరాబాద్లో విమర్శించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యేందుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయని బాలినేని ఆరోపించారు. కుమ్మక్కయిన పార్టీలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని బాలినేని వ్యాఖ్యానించారు.