వ్యవసాయ రుణాల మాఫీపై బాబు మోసం

హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను మోసం చేశారని వైఎస్సార్ సీపీ రైతు విబాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి గారు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ రైతుల  వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని వాగ్ధానం చేశారని, ఇప్పుడు పంట రుణాలు మాత్రమేనని మాటమార్చారని దుయ్యబట్టారు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న స్వల్ప, దీర్ఘ కాలిక, ప్రాసెసింగ్ యూనిట్ తాలూకా తీసుకున్నవన్నీ వ్యవసాయరుణాలేనని ఆయన వివరించారు.

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకుంటున్న వ్యక్తికి వ్యవసాయరుణాలు,పంట రుణాలకు తేడా తెలియదా? నిజంగా తెలియకపోతే తనకు తెలియకుండానే వాగ్ధానం చేశానని రాష్ర్ట రైతులకు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఎవరినీ మోసం చేసే వారు కాదని, అలాంటి వారిని చంద్రబాబు మోసం చేయడం ఏ మాత్రం మంచిది కాదని హితవు చెప్పారు. డ్వాక్రా మహిళల ,చేనేత కార్మికుల రుణాలను కూడా మాఫీ చేస్తానిన చెప్పి చంద్రబాబు మాట తప్పారన్నారు.

రాష్ట్ర విభజనకు ముందే మొత్తం మీద 1.27 లక్షల రూపాయల రూణాలుంటే, వాటిని ఎలా మాఫీ చేస్తారని తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే.. తాను ఎంఏ ఎకనామిక్సు చదువుకున్నానని, ఎలా చేయాలో తెలుసునని చంద్రబాబు బుకాయించారని గుర్తు చేశారు. మీరిచ్చిన హమీని ఎలా నెరవేరుస్తారని కేంద్ర ఎన్నికల కనీషన్ టీడీపీకి నోటీసులిస్తే ..పూర్తి అవగాహనతోనే హమీ ఇచ్చామని, తప్పకుండా వ్యవసాయరుణాల మాఫీ చేస్తానని వారికి చంద్రబాబు సమాధానం  ఇచ్చారని చెప్పారు.

రైతులెవరూ రుణాలు కట్టోద్దని, తాకట్టుపెట్టిన బంగారం, బ్యాంకుల్లోని దస్తావేజులు ఇంటికి వస్తాయని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారని గుర్తు చేశారు. ఆయన మాటలు నమ్మి రుణాలు కట్టని రైతులపై ఇపుడు అదనంగా వడ్డీభారం పడటమే కాక, పంటలు నష్టపోయిన రైతులు చివరికి బీమా సౌకర్యాన్ని కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. హుదూద్ తుపానులో దారుణంగా పంటలు నష్టపోయిన రైతులకు కూడా బీమా లేకుండా పోయిందన్నారు. రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని మొదట చెప్పి, ఆ తరువాత ఇంటికొకటి చొప్పున మాచ్రమే రద్దు చేస్తానని మాటమార్చి చంద్రబాబు రైతులను మానసిక సంఘర్షణకు గురి చేస్తూ విశ్వసనీయత లేని నాయకుడనిపించుకున్నారని నాగిరెడ్డి విమర్శించారు.

పొలాలే లేని సింగపూర్ లాగా చేస్తారా?

రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతంలో చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ 365 రోజులూ పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కోవాలని చూస్తున్నారని నాగిరెడ్డి విమర్శించారు. మాట్లాడితే చంద్రబాబు ఆంధ్రాను మరో సింగపూర్ చేస్తానని అంటున్నారు. సింగపూర్  లో పొలాలు లేవు, మంచినీళ్లు కూడా మలేషియా నుంచి వెళ్లాల్సిందే.. అక్కడున్నదంతా వ్యాపారమే (ట్రేడేంగ్), ఆంద్రప్రదేశ్ లో కూడా పొలాలు లేకుండా చేయాలనుకుంటున్నారా?" అని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ రైతుల నోళ్లు కొడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పంటలు అంతగా పండని వేలాది ఎకరాలు ఉండగా వాటిని వదిలి పెట్టి ఏడాది పొడవునా పంటలు పండే బంగారం లాంటి భూములపై చంద్రబాబు కన్ను ఎందుకు పడిందని ప్రశ్నించారు.

Back to Top