పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
బాబుదే దొంగ మనస్తత్వం:భూమన
16 Jan 2013 12:04 PM
తిరుపతి :
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కోట్ల మంది సంతకాలు చేస్తే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జీర్ణించుకోలేక పోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టీడీపీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోందన్న అక్కసుతో అవాస్తవాలు పలుకుతున్నారన్నారు. దొంగ మనస్తత్వం గల చంద్రబాబు నోట ఏనాడు వాస్తవం రాలేదని ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు కోటి సంతకాలపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. శ్రీ జగన్మోహనరెడ్డి అరెస్టుకు నిరసనగా జనం ఇప్పుడు స్పందించినట్లే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా స్పందిస్తారన్నారు. చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలు తప్పవని భూమన జోస్యం చెప్పారు.