విజయవాడ: ఏపీలో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ–2021 తీసుకువస్తామని చెప్పారు. లాజిస్టిక్ పాలసీ–2021పై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆప్ లాజిస్టిక్స్ ఉంటుందని చెప్పారు.