అందరి నోటా ఒకే మాట.. 

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే

రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ రౌండ్‌టేబుల్‌, టౌన్‌హాల్‌ సమావేశాలు

డీఎస్సీ బాధిత అభ్యర్థుల ఆవేదన.. అక్రమాలపై ఆధారాలతో వివరాలు

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఏకగ్రీవ తీర్మానం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌

తాడేప‌ల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిమాండ్ వినిపించింది. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌, టౌన్‌హాల్‌ సమావేశాల్లో పార్టీ నేతలు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో నిష్పక్షపాత విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

-శ్రీకాకుళం:
 శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమావేశం జరిగింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

- కాకినాడ: 
తునిలో జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. డీఎస్సీ బాధితులకు న్యాయం చేసి, నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు.

- తూర్పుగోదావరి: 
రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామాతో పాటు విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: 
అమలాపురంలో నిర్వహించిన ఏపీ జెన్‌-జెడ్ వార్ టౌన్‌హాల్‌లో డీఎస్సీ బాధితులు తమ వినతిపత్రాన్ని పార్టీ నేతలకు అందజేస్తూ సీబీఐ విచారణ కోరారు.

- పశ్చిమగోదావరి:
తణుకులో చల్లా ఆనంద్ ప్రకాష్, కొట్టు నాగు ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా, నిరుద్యోగ భృతి అమలును డిమాండ్ చేశారు.

- ఏలూరు: 
మామిళ్లపల్లి జయప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరారు.

- కృష్ణా:
 గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- ప్రకాశం:
 దర్శిలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు విద్యా సంక్షేమ పథకాల బకాయిలు విడుదల చేయాలని కోరారు.

- కడప: 
ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశమై ఆగస్టు 6 నుంచి ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- కర్నూలు: 
కర్నూలులో బీవై రామయ్య ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- అనంతపురం: 
 గుంతకల్లులో జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించి, ఆగస్టు 6 నుంచి రిలే దీక్షలు, ఆగస్టు 10న భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

- శ్రీ సత్యసాయి: 
పెనుకొండలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించి, డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా కోరుతూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. హిందూపురంలో టీఎన్ దీపిక వేణురెడ్డి ఆధ్వర్యంలో కూడా రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.

 - చిత్తూరు: 
పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, చిత్తూరులో ఎంసీ విజయానంద రెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంకటగిరిలో నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. 

- విజయనగరం: 
విజయనగరంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు.

- విశాఖపట్నం: 
విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

- అనకాపల్లి: 
 అనకాపల్లిలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 - అల్లూరి సీతారామరాజు: 
పాడేరులో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- బాపట్ల:  

బాపట్ల జిల్లాలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

- నంద్యాల: 
 నంద్యాలలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీఎస్సీ–2025 అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు.

- కర్నూలు: 
 కర్నూలు నియోజకవర్గంలో బీవై రామయ్య ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, లోకేష్ రాజీనామా చేయాలని, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- శ్రీ సత్యసాయి:
 పెనుకొండలో ఉషశ్రీ చరణ్, హిందూపురంలో టీఎన్ దీపిక వేణురెడ్డి ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించారు. డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ, లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 
 

Back to Top