మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబు.. ఓ గల్లీ లీడర్
13 Jan 2020 5:56 PM
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం : ప్రతిపక్ష నేత చంద్రబాబు జాతీయ నాయకుడు కాదని, ఓ గల్లీ లీడర్ అంటూ వైయస్ఆర్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సామాజిక వర్గం కోసం చంద్రబాబు పోరాడుతున్నారని అన్నారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు అవసరమని, అదే డబ్బుతో ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయవచ్చన్నారు. అమరావతిలో టీడీపీ ఓడిపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. రాయలసీమ వెనుకబాటుకు చంద్రబాబే కారణమని, బాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. ‘చంద్రబాబు! నీకు ఏపీ ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు.