రైతు సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి
 

కృష్ణా జిల్లా: రైతు సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అగ్రికల్చర్‌  మిషన్‌ ఏర్పాటు చేసి సహకారం అందిస్తున్నారని చెప్పారు.కౌలు రైతులకు కార్డులను గ్రామ సచివాలయాల ద్వారానే అందిస్తామన్నారు. రైతులకు దక్కాల్సింది ఏదైనా సిఫారస్‌ లేకుండానే లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. 600 హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారన్నారు. టీడీపీ నేతలు మా ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. వంద రోజుల్లోనే 80 శాతం పథకాలను అమలు చేసిన ఘనత మాదే అన్నారు. అవినీతికి పాల్పడితే ఎవరైనా సహించేది లేదని హెచ్చరించారు. 

 

Back to Top