వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పరామర్శ పేరుతో మాచర్లలో విధ్వంసానికి టీడీపీ కుట్ర
24 Dec 2022 11:32 AM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజం
పల్నాడు: మాచర్లలో మరోసారి అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గొడవలు సృష్టించాలనే కుట్రతోనే చలో మాచర్లకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిందన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ప్లాన్ ప్రకారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. గతంలో కూడా మాచర్లలో గొడవలు సృష్టించారని, ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనన్నారు. పరామర్శ పేరుతో మాచర్లలో విధ్వంసానికి కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ మాఫియాతో కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు.