కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రజల స్వేచ్ఛను జేసీ సోదరులు హరిస్తున్నారు
25 Mar 2019 2:49 PM
జేసీ సోదరుల బెదిరింపులకు భయపడొద్దు..
రాజన్న రాజ్యం కోసం కలిసి పోరాడాలి
తాడిపత్రి వైయస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం: తాడిపత్రిలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకొనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్ఆర్సీపీ తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. గాలి,నీరు,ప్రజలస్వేచ్ఛను కూడా జేసీ సోదరులు హరిస్తున్నారన్నారు. జేసీ సోదరులు ఎంతనీచమైన వారో అందరికి తెలుసునన్నారు. మున్సిపల్ కాంప్లెక్స్లో ప్రతిఒక్కరూ 15 లక్షలు మామూళ్లు కడుతున్నారన్నారు. చికెన్ షాపులో కేజీ 20 రూపాయలు డబ్బులు కడుతున్నారన్నారు. తాడిపత్రిలో దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. జగనన్న రాజ్యం రావాలంటే మనమందరం కలిసి పోరాటం చేయాలన్నారు.ఓటు అనే ఆయుధంతో వారిని గద్దె దించాలన్నారు. జేసీ దివాకర్ రెడ్డి గ్రామాల్లో వైయస్ఆర్సీపీ నేతలు,కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.ౖ వెయస్ఆర్సీపీకి మద్దతు తెలిపితే 11వ తేదీ తర్వాత మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. 11వ తేదీ తర్వాత జేసీ సోదరులు తాడిపత్రి వదిలి పారిపోవాలన్నారు. జేసీ సోదరులకు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని, జేసీ సోదరుల అరాచకాలు అరికట్టేందుకు జగనన్న నన్ను ప్రతినిధిగా పంపించారని తెలిపారు.ప్రజలందరికి అండగా ఉంటామన్నారు.