మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఓటమి భయంతో బాబు దిగజారుడు రాజకీయాలు
02 Mar 2019 2:42 PM
ఓట్ల తొలగింపుపై ఈసీ చర్యలు తీసుకోవాలి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం: ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లు సృష్టించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. దొంగ సర్వేల పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్ సీపీ ఓట్లు తొలగించేందుకు బాబుకు సిగ్గుండాలన్నారు. ఆన్లైన్ ఫారం – 7 ద్వారా వైయస్ఆర్ సీపీ ఓట్లు తొలగిస్తున్నారన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయామని గ్రహించిన చంద్రబాబు దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఓటరు జాబితా అక్రమాలపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.