రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోంది
26 May 2023 10:36 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సీబీఐ కౌంటర్ అఫిడవిట్లో సీఎం వైయస్.జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర
ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉంది
అసలు దీనిపై దర్యాప్తు జరగాలి
హైదరాబాద్: దిగజారిపోయిన రాజకీయ పార్టీ మాదిరిగా సీబీఐ కూడా వ్యవహరిస్తోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అసలు దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్కు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
వివేకా హత్య కేసులో అవినాష్ను, ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ను టార్గెట్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటూ వస్తోంది. ఒక స్క్రిప్టు రాసుకుని.. దాని విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా చవకబారు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం సెన్షేషనలైజేషన్కోసమే ఇవన్నీ చేస్తున్నారు. సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఈ ఎల్లోమీడియాకు ఎలా ముందుతెలుస్తోంది. ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేస్తుంటే.. దాన్ని సీబీఐ మెన్షన్ చేస్తోంది. దర్యాప్తు సంస్థ ఏదైనా మెన్షన్ చేస్తే దానికి ఆధారాలు చూపిస్తుంది. కాని ఇక్కడ అదేమీ జరగలేదు. ముందే అనుకుని అవినాష్రెడ్డి అరెస్టులకు ఏం కావాలో రాస్తున్నారు. ఆ స్క్రిప్టును ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నారు. సీబీఐ ఆ అంశాలను ప్రస్తావించగానే మేం ముందుగానే చెప్పాం కదా అని అంటున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతోంది. సీబీఐ కౌంటర్ వేయకుముందే దానిలో పొందుపరిచే అంశాలను ముందుగా ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. సీబీఐ తీరులో విపరీత ధోరణి, అత్యంత అన్యాయమైన తీరు కనిపిస్తోంది.
ఉన్నట్టుండి… సడన్గా.. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి పేరును ప్రస్తావించడమే దీనికి నిదర్శనం. అసలు దీనికి ఏ ఆధారమేదీ వాళ్లదగ్గర ఏమీ కనిపించడంలేదు. చిల్లర చేష్ట మాదిరిగా ఉంది.
వైయస్ జగన్ గారి పేరును ప్రస్తావించి దాన్ని సెన్షేషనలైజేషన్కోసం వాడుకోవాలన్న తీరు కనిపిస్తోంది.
సీబీఐ ఇలా కౌంటర్ అఫిడవిట్ విషయం తెలియగానే, టీడీపీ పొలిట్ బ్యూరోలో దీనిపై చర్చించడం, వైయస్ జగన్గారి పాత్ర అందరికీ తెలుసంటూ వారు ఆరోపణలు చేయడం.. ఇదంతా గొలుసుకట్టు మాదిరిగా ఈ వ్యవహారం నడుస్తోంది.
ఇది ఒక పెద్ద కుట్ర
సీబీఐ అఫిడవిట్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి పేరును ప్రస్తావించడం ఒక పెద్ద కుట్ర. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో ముందు తేల్చాలి. దానిపై అసలు దర్యాప్తు జరగాలి. ఈ కుట్రలో చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావుల పాత్రపే తేల్చాలి. సునీత, వీళ్ల మధ్య ఏముందనేది తేల్చాలి. ముందే ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేసి, దాన్ని సీబీఐ ప్రస్తాదించడం ఇక్కడ చూడాల్సిన విషయం. సీబీఐ కౌంటర్లో పేర్కొన్న అంశంలో హేతు బద్ధత లేదు. సీబీఐ రాసింది కాబట్టి.. ఈ మాటలు కూడా చెప్పాల్సి వస్తుంది. ముందుగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో అవినాష్రెడ్డి పేరు లేదు.
సడన్గా ఓ కౌంటర్ వేసి.. నిందితుడు అని చెప్తారు. సీబీఐ రెండునెలలు దస్తగిరిని తన దగ్గర పెట్టుకుని అవినాష్ పేరును ప్రస్తావనకు తెచ్చేలా చేస్తారు. ఆతర్వాత బెయిల్ ఇస్తారు. విచిత్రంగా ఈ బెయిల్ను సునీత అభ్యంతరం పెట్టదు. సుమారు ఏడాదిన్నర తర్వాత అవినాష్ పేరును సీబీఐ ప్రస్తావిస్తోంది.
సడన్గా భాస్కర్రెడ్డిని అరెస్టచేస్తారు.. తర్వాత అవినాష్ను అరెస్టు చేయాలంటారు. ఇప్పుడేమో కౌంటర్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తారు. అసలు వీటికి ఆధారలు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు.
దర్యాప్తులో చూడాల్సిన కోణాలు ఎన్నో ఉన్నాయి. కాని, వాటి జోలికిపోరు. షమీమ్ స్టేట్మెంట్ను పట్టించుకోరు, ఆస్తివివాదాలను ప్రస్తావించినా సీబీఐ దాన్ని పట్టించుకోలేదు. పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఆస్పత్రిలో ఉండి.. మధ్యలో టీడీపీ నాయకుడు బీటెక్ రవిని కలిసి వస్తాడు. ఇన్ని ఉండగా వీటిని సీబీఐ పట్టించుకోలేదు.
ఇప్పుడు ముఖ్యమంత్రిగారికి సమాచారం పోయిందన్న ఆరోపణ సడన్గాచేస్తున్నారు. అందరూ చర్చించుకోవాలన్న దృక్పథంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాటికి ఆధారాలు మాత్రం ఉండడం లేదు. దిగజారిపోయిన రాజకీయ పార్టీ మాదిరిగా సీబీఐ కూడా వ్యవహరిస్తోందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.