రోడ్డు ప్ర‌మాదంపై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి 

తాడేప‌ల్లి: అన్నమయ్య జిల్లా రోడ్డు ప్ర‌మాదంలో టెంపో వాహనం-లారీ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి  వ్య‌క్తం చేశారు. కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్ట‌డంతో టెంపోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ  ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతులను కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Back to Top