కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ చైర్మస్‌ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా టెస్టుల నిర్వాహణ, క్వారంటైన్లలో మౌలిక సదుపాయాలు, నిత్యావసర సరుకుల సరఫరా తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
 

Back to Top