ఇడుపులపాయ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి 76వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద వైయస్ఆర్ సతీమణి వైయస్ విజయమ్మ, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, వైయస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.