అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెళుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైయస్ జగన్ గురువారం ‘టైమ్స్ నౌ’ తో మాట్లాడారు. ప్రజలు, దేవుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారన్న వైయస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోదీకి వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వైయస్ జగన్కు ఫోన్ చేసి అద్భుత విజయం సాధించారని అభినందించారు.