ఆలయాలపై దాడుల‌ పేరుతో నీచ రాజకీయాలు 

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

విజ‌య‌వాడ‌లో వైభవంగా వైయ‌స్ఆర్‌ ఆసరా వారోత్సవాలు

విజయవాడ: ఆలయాలపై దాడుల‌ పేరుతో చంద్ర‌బాబు నీచ రాజకీయాలు చేస్తున్నార‌ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిప‌డ్డారు. ఆయ‌న‌ చేసే కుట్ర రాజకీయాలతో రాబోయే ఎన్నికల్లో కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు. గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిగిన ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు. వేడుకల ముగింపు సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం ఆర్‌పీలకు, డ్వాక్రా గ్రూప్ లీడర్లకు చెక్కులు పంపిణీ చేశారు.

 ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు..

కరోనా వైరస్‌ సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్నా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికల హామీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా పని చేస్తున్నారని కొనియాడారు.  గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పధకాలను చేరుస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో సమస్యలు సీఎం వైయ‌స్ జగన్ దృష్టికి తీసుకెళ్లి దేవినేని అవినాష్ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాత్రం మాటలతో కాలక్షేపం చేస్తున్నాడని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలో రూ.250 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని తెలిపారు. చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో భూములన్నీ బినామిలకు దోచిపెట్టాడని దుయ్యబట్టారు.  విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురుతుందని తెలిపారు. 

30 ఏళ్లపాటు వైయ‌స్ జగనే ముఖ్య‌మంత్రి: దేవినేని అవినాష్

 సీఎం వైయ‌స్‌ జగన్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని  వైయ‌స్సార్‌సీపీ విజయవాడ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్ అన్నారు. గతంలో చంద్రబాబు మహిళలని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వైయ‌స్ జగన్ మహిళలుకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి దేశంలోనే రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు. మరో 30 ఏళ్లపాటు వైయ‌స్‌ జగన్ తప్పకుండా ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు అందరి ఆశీస్సులు సీఎం వైయ‌స్ జగన్‌కి ఉన్నాయని గుర్తుచేశారు. 30లక్షల మందికి త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. దివంగత వైయ‌స్సార్‌ కన్న కలలు అన్ని వైయ‌స్ జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలని సీఎం వైయ‌స్ జగన్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ ద్వారా సీఎం వైయ‌స్‌ జగన్‌ మహిళలుకి మరింత చేరువయ్యారని అన్నారు. మహిళలు అందరూ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని దేవినేని కోరారు.   

Back to Top