ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
బాధితురాలికి అండగా ఉంటాం
29 Aug 2019 3:52 PM
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
విశాఖపట్నం: అనకాపల్లిలో ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న డిగ్రీ విద్యార్థిని భార్గవిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజులు ఆమె వెంట ఉన్నారు. భార్గవికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. భార్గవి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి అండగా ఉంటామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ఎస్పీకి సూచించారు. దాడులను స్థానికులు అడ్డుకుంటే సగం నేరాలు తగ్గిపోతాయన్నారు.