టీడీపీ ప‌త‌న‌మే వంగ‌వీటి రంగా ఆశయం 

రాధా టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారు

పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేయిస్తున్నారు

ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ఉంటుందా?

రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర 

విజ‌య‌వాడ‌:  టీడీపీ ప‌త‌న‌మే వంగ‌వీటి రంగ ఆశ‌య‌మ‌ని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. వంగ‌వీటి రాధా టీడీపీలో చేరి తండ్రి ఆశ‌యాల‌ను నీరు గార్చార‌ని విమ‌ర్శించారు. శ‌నివారం వంగ‌వీటి న‌రేంద్ర మీడియాతో మాట్లాడారు.

రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర ఏమ‌న్నారంటే..

  • వైయ‌స్ఆర్‌, వంగవీటి ఫ్యామిలీల మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి
  • కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి సీఎం జగన్‌ను విమర్శించటం కరెక్టు కాదు
  • 2014లో రాధాకు సీటు ఇస్తే ఓడిపోయాడు.
  • 2019లో వేరే సీటు ఇస్తానని జగన్ చెప్తే కాదని పార్టీ మారాడు
  • అంతకుముందు వరకు నా తండ్రిని చంపినది టీడీపీ వారే అని చెప్పాడు
  • ఇప్పుడేమో మాట మార్చి మాట్లాడుతున్నారు
  • వంగవీటి రంగా త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు
  • రంగా ఆశయం టీడీపీ పతనం
  • కానీ రాధా మాత్రం అదే టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారు
  • పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేయిస్తున్నారు
  • ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ఉంటుందా?
  • వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన కాపు మహిళలపై కమ్మ నేతలు దాడి చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు?
  • తెనాలిలో గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?
  • జనసేనలో వీర మహిళలకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు?
  • వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలి
  • జనసేనని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన పవన్‌ని గట్టిగా ప్రశ్నించాలి
  • ధవళేశ్వరం బ్యారేజ్‌ కట్టించిన కాటన్ దొరని ప్రజలు ఇప్పటికీ పూజలు చేస్తున్నారు
  • మరి హైదరాబాద్‌ని కట్టించానని చెప్పుకునే చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు?
  • ఎందుకంటే.. చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్దాల కోరు అని తెలుసు కాబట్టే
  • జగన్ ప్రజలకు మేలు చేసినందునే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు
Back to Top