విజయవాడ: టీడీపీ పతనమే వంగవీటి రంగ ఆశయమని రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. వంగవీటి రాధా టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారని విమర్శించారు. శనివారం వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడారు. రాధా-రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర ఏమన్నారంటే.. వైయస్ఆర్, వంగవీటి ఫ్యామిలీల మధ్య కొన్ని దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి సీఎం జగన్ను విమర్శించటం కరెక్టు కాదు 2014లో రాధాకు సీటు ఇస్తే ఓడిపోయాడు. 2019లో వేరే సీటు ఇస్తానని జగన్ చెప్తే కాదని పార్టీ మారాడు అంతకుముందు వరకు నా తండ్రిని చంపినది టీడీపీ వారే అని చెప్పాడు ఇప్పుడేమో మాట మార్చి మాట్లాడుతున్నారు వంగవీటి రంగా త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారు రంగా ఆశయం టీడీపీ పతనం కానీ రాధా మాత్రం అదే టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరు గార్చారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేయిస్తున్నారు ఇంతకంటే సిగ్గుమాలిన రాజకీయం ఉంటుందా? వైయస్ఆర్సీపీకి చెందిన కాపు మహిళలపై కమ్మ నేతలు దాడి చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? తెనాలిలో గీతాంజలి చావుకు కారణమైన టీడీపీ వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు? జనసేనలో వీర మహిళలకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు? వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేయాలి జనసేనని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన పవన్ని గట్టిగా ప్రశ్నించాలి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించిన కాటన్ దొరని ప్రజలు ఇప్పటికీ పూజలు చేస్తున్నారు మరి హైదరాబాద్ని కట్టించానని చెప్పుకునే చంద్రబాబును ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకంటే.. చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్దాల కోరు అని తెలుసు కాబట్టే జగన్ ప్రజలకు మేలు చేసినందునే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు