రేపు  క‌ర్నూలుకు సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

ప్రపంచంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన  

 

కర్నూలు : ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గుమ్మితం తండాలో చేయాల్సిన ఏర్పాట్లపై  అధికారులు, గ్రీన్‌కో ప్రతినిధులతో  కలెక్టర్‌ కోటేశ్వరరావు సమావేశమయ్యారు. పోలీసు బందోబస్తు, కార్యక్రమ నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌రెడ్డి, ఇతర అధికారులను ఆదేశించారు. గ్రీన్‌కో ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రోటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు.
 

5,410 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యంతో గ్రీన్‌ కోఎనర్జీస్‌ లిమిటెడ్‌ నిర్మించే పవర్‌ ప్రాజెక్టు నుంచి సోలార్, విండ్, హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి  అవుతుందన్నారు. ఇలా ఒకే ప్లాంట్‌ నుంచి మూడు రకాల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదట కర్నూలు జిల్లాలో నిర్మితం అవుతుండటం సంతోషకరమన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో  సీఎం పర్యటన ఏర్పాట్లపై డైరెక్టర్‌ విద్యాసాగర్‌తో చర్చించారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   

తాజా వీడియోలు

Back to Top