పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత..

వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

పోతిరెడ్డిపాడు: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు వైపు వెళ్లకుండా వారిని నిలువరించడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, ఆయకట్టు రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అక్కడికి వెళ్లారు. అయితే వారిని పోలీసులు ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

పోలీసుల తీరుపై నేతల ఆగ్రహం

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ప్రాజెక్టు పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకె శైల‌జానాథ్‌, నంద్యాల జిల్లా అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, నందికొట్కూరు ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ దారా సుధీర్‌, త‌దిత‌రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోందని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీటి పరిస్థితులు, రైతులకు అందుతున్న సాగునీరు తదితర అంశాలను పరిశీలించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రయత్నించారు. ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది.

ప్రజా సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

ప్రజలు, రైతుల నీటి సమస్యలను తెలుసుకుని వారి తరఫున నిలబడేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు వద్ద చోటుచేసుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. పోతిరెడ్డిపాడు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ప్రజల నీటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
 

Back to Top