'కరోనా' నియంత్రణ చర్యలపై సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. కేసులు అత్యథికంగా ఉన్న జిల్లాల్లో చేపడుతున్న చర్యలు, కరోనా టెస్టులు, నిత్యావసర సరుకుల సరఫరా, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు తదితర అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. 

Back to Top