తాడేపల్లి: రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దళితులపైన దాడులు కామన్గా మారాయని, వారిపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారన్న ఆయన, తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై థర్డ్ డిగ్రీ దారుణం అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో జూపూడి ప్రభాకర్రావు ఇంకా ఏమన్నారంటే..: సంక్షేమానికి అర్థం చెప్పిన వైయస్ జగన్ పాలన: 2019–24 మధ్య శ్రీ వైయస్ జగన్, తన పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్పి, దేశానికే ఆదర్శ«ంగా నిల్చారు. పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చేందుకు ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశానికి రోల్ మోడల్గా నిలిచాయి. పేదలకు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఒక్క అమరావతిలోనే 50 వేల మంది కోసం ఏకంగా 900 ఎకరాలు కేటాయించడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులు ప్రపంచాన్ని ఏలగలరన్న నమ్మకం కలిగించారు. నాడు– నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో సమూల మార్పులు, కొత్తగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, మారుమూల గ్రామాల్లో కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదే ఇప్పుడుక్ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.1.5 లక్షల కోట్లకుపైగా అప్పు చేసినా, ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, అరాచకాలపై మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ నిలదీస్తే, కూటమి పార్టీలకు ఇప్పటికీ సమాధానం చెప్పే ధైర్యం లేదు. వేధిస్తున్నామని మహానాడులో ఒప్పుకున్నారు: ఎన్నికల్లో గెల్చేందుకు అడ్డగోలుగా హామీలు గుప్పించిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజలను దారుణంగా వంచించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారు. ‘ఈ ఏడాదిలో మేము చాలా తక్కువ మందినే కొట్టాము. తక్కువ మందినే జైల్లో పెట్టాం. అందుకే రెడ్ బుక్ ఓపెన్ చేశామని సిగ్గు లేకుండా మహానాడులో చెప్పుకుంటున్నారు. శిరస్సు మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకుని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుముకొని.. మహానాడు పేరుతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు’. నిజానికి కూటమి ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేదు. సూపర్ సిక్స్ హామీల అమలు ఊసెత్తడం లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తుందని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు: రాష్ట్రంలో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. కూటమి నాయకులు తమకు గిట్టని వైయస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. రాజ్యాగం కల్పించిన మాట్లాడే హక్కు, జీవించే హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. నోరెత్తితే కొట్టడం, కేసులు పెట్టడం, ప్రాణాలు తీసేయడానికి కూడా వెనుకాడటం లేదు. కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కట్ట కట్టి బంగాళాఖాతంలో విసిరేసే రోజు త్వరలోనే వస్తుంది. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై నడిరోడ్డు మీద పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ తాజాగా వెలుగులోకి వచ్చింది. కొట్టొద్దని వేడుకుంటున్నా పోలీసులు లాఠీలతో యువకుల అరికాళ్లపై చితకబాదారు. ఒక సీఐ ఒక యువకుడి కాళ్లను బూటు కాలితో తొక్కి పెట్టగా, మరో సీఐ ఆ యువకుడి అరికాళ్లపై కొట్టడం.. మరో ఇద్దరిని కూడా అదే విధంగా అరికాళ్లపై లాఠీలతో చితకబాదడం, రాష్ట్రంలో దారుణంగా మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. పైగా ఎస్సీ నా కొడకల్లారా అంటూ పోలీసులు దుర్భాషలాడారు. స్థానిక సమస్యల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడన్న కారణంతో రాజమండ్రికి చెందిన పులి సాగర్ అనే దళిత యువకుడ్ని పోలీసులు స్టేషన్కి పిలిపించి కొట్టి బెదిరించారు. అంతటితో ఆగకుండా విద్యావంతుడైన ఆ యువకుడ్ని అర్థనగ్నంగా లాకప్లో నిలబెట్టారు. అక్కడ మహిళా కానిస్టేబుల్ ని కాపలాగా ఉంచి మానసికంగా వేధించారు. సాగర్ను ఉద్దేశించి బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా కంతేరులో కల్పన అనే దళిత ఎంపీటీసీని చీర మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్థరాత్రి 20 మంది పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి లాక్కెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందన్న కారణంతో పాలేటి కృష్ణవేణి అనే మహిళను హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆమెను కలిసే అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కే తాళాలు వేశారు. ఇదంతా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగ ఫలితమే. సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలో.: మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తెనాలిలో దళిత యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొడుతుంటే, వారి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఏకంగా దళితులను అంతం చేస్తున్నారు. 1989 యాక్ట్ ప్రకారం దళితులను లక్ష్యంగా చేసుకుని మానసికంగా శారీరకంగా వేధించడం చట్ట ప్రకారం నేరం. ఈ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలుంటాయి. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను కొట్టిన పోలీసులను తక్షణం సస్పెండ్ చేసి వారిపై కేసు నమోదు చేయాలి. లేదంటే వారిపైన వైయస్ఆర్సీపీ తరఫున ప్రైవేటు కేసు పెడతాం. ప్రజలిచ్చిన అధికారాన్ని పాలన వరకే పరిమితం చేస్తే మంచిది. ప్రతీకార రాజకీయాలకు వాడితే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జూపూడి ప్రభాకర్రావు స్పష్టం చేశారు.