వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలా!
28 Oct 2021 6:08 PM
మంత్రి పేర్ని నాని
సచివాలయం: తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలా అని మంత్రి పేర్ని నాని చమత్కరించారు. కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నామని తెలిపారు. ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘ఏపీలో పార్టీ పెట్టడానికంటే ముందు కేసీఆర్ తెలంగాణ కేబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్నిపెడితే బాగుంటుంది. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణలు ఒకటే రాష్ట్రంగా ఉండాలని వైయస్ జగన్ గతంలోనే కోరుకున్నారు’’ అన్నారు.
‘‘ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎలాంటి బలవంతం లేదు. ఐచ్చికంగానే వారు తమ నిర్ణయం తీసుకోవచ్చు. ఏపీలో గంజాయి గురించి కేబినెట్లోనే చర్చించామని 2017లోనే అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా 2018లోనే గంజాయి సాగవుతోందని ట్వీట్ చేశారు’’ అని పేర్ని నాని తెలిపారు.