కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నవంబర్ 14 నుంచి ఇసుక వారోత్సవాలు
12 Nov 2019 1:20 PM
ఇసుక ఎక్కవ రేటుకు అమ్మితే జైలుశిక్షే
జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయండి
చిన్న, పెద్ద రూట్లలో చెక్పోస్టులు, సీసీ కెమెరాలు తప్పనిసరి
వారోత్సవాలు పూర్తయ్యేలోపు స్టాక్పాయింట్ల సంఖ్య పెంచాలి
స్పందన సమీక్షలో అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశం
తాడేపల్లి: నవంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. గతంలో సరాసరి ఇసుక డిమాండ్ 80 వేల టన్నులు ఉండేదని, వరదల కారణంగా రీచ్లు మునిగి టార్గెట్ను చేరుకోలేకపోయామన్నారు. కానీ, గత వారం రోజులుగా ఈ పరిస్థితి మెరుగుపడిందన్నారు. 1.20 లక్షల టన్నులకు రోజువారీ ఇసుక సరఫరా పెరిగిందని చెప్పారు. ఇసుక రీచ్ల సంఖ్య సుమారు 60 నుంచి 90కి చేరిందన్నారు. 1.2 లక్షల టన్నుల నుంచి 2 లక్షల టన్నుల వరకు వారం రోజుల్లో పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇసుక వారోత్సవాలు పూర్తయ్యేలోపు 180కిపైగా స్టాక్ పాయింట్లు పెంచాలని ఆదేశించారు.
నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలని సీఎం ఆదేశించారు. రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్ చేసి జిల్లాల వారీగా రేటు కార్డులపై ప్రచారం చేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్లను ఇన్చార్జిలుగా పెట్టాం కాబట్టి, వారు స్టాక్పాయింట్లను పూర్తిగా పెంచాలన్నారు. ఎవరైనా ఎక్కువ రేటుకు అమ్మితే పెనాల్టీయేకాదు, సీజ్ చేయడమే కాదు, 2 ఏళ్ల వరకూ జైలుశిక్ష కూడా విధించడం జరుగుతుందని, దీనికి రేపు కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంటామని చెప్పారు.
ఇసుక కొరత తీరేంత వరకూ ఎవ్వరూ కూడా సెలవులు తీసుకోకూడదని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు. ఇసుక తవ్వకాల్లో, విక్రయాల్లో కాని సిబ్బంది సెలవులు తీసుకోకుండా పనిచేయాలన్నారు. సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నరూట్లు, పెద్ద రూట్లు అని తేడా లేకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా వీడియో కెమెరాలు కూడా అమర్చాలని ఆదేశించారు. 10 రోజుల్లో చెక్పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తికావాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్ అండ్ బీ, ఏపీ ఎండీసీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
అక్రమ రవాణా, ప్రకటించిన ధరలకు మించి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.