ఆర్బీకేల పుణ్యమా అని  అన్ని సేవలూ గ్రామాల్లోనే ..

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  ఒకప్పుడు వ్యవసాయ సమాచారం కావాలన్నా, సమస్య వచ్చినా మండల, జిల్లా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగవలసి వచ్చేది. జగన్ గారు ప్రారంభించిన ఆర్బీకేల పుణ్యమా అని  అన్ని సేవలూ గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. నేడు10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు వ్యవ'సాయ' సేవలకు చిరునామాగా మారాయి అంటూవైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్ పై  వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని ట్విట్ట‌ర్ వేదిక‌గా వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top